Amit Shah Telangana Tour: తెలంగాణ బీజేపీపై ఫోకస్, మరోసారి హైదరాబాద్‌ రానున్న కేంద్రమంత్రి అమిత్ షా, రెండు సభల కోసం బీజేపీ సన్నాహాలు, టూర్ షెడ్యూల్ ఫిక్స్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah Tour) తెలంగాణ పర్యటనకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి ఒకేరోజు తెలంగాణలో రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆదిలాబాద్ లో ఒక సభ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో సభ ఉంటాయి. మధ్యాహ్నం 3గంటలకు అమిత్ షా ఆదిలాబాద్ చేరుకుంటారు. 3 గంటల నుండి 4 వరకు ఆదిలాబాద్ జన గర్జన సభలో పాల్గొంటారు.

Credits: Twitter/ANI

Hyderabad, OCT 08: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో బీజేపీ (T-BJP) అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. టూర్లు, సభలు, సమావేశాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలంగాణ వచ్చారు. సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల శంఖారావం పూరించారు. ఇప్పుడు బీజేపీకి చెందిన మరో కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah Tour) తెలంగాణ పర్యటనకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి ఒకేరోజు తెలంగాణలో రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆదిలాబాద్ లో ఒక సభ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో సభ ఉంటాయి. మధ్యాహ్నం 3గంటలకు అమిత్ షా ఆదిలాబాద్ చేరుకుంటారు. 3 గంటల నుండి 4 వరకు ఆదిలాబాద్ జన గర్జన సభలో పాల్గొంటారు. 4.15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుండి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకుంటారు.

 

5గంటల 15 నిమిషాలకు శంషాబాద్ నోవోటల్ చేరుకుంటారు. 45 నిమిషాల పాటు షెడ్యూల్ రిజర్వ్ చేశారు బీజేపీ నేతలు. రాత్రి 6గంటల 15 నిమిషాలకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో జనగర్జన సభలో అమిత్ షా పాల్గొంటారు. గంటపాటు సభా వేదికపై గడపనున్నారు అమిత్ షా. రాత్రి 7గంటల 30 నిమిషాలకు శంషాబాద్ నోవోటల్ చేరుకుంటారు. అనంతరం నాలుగు గంటల పాటు షెడ్యూల్ రిజర్వ్ లో ఉంచారు. ఈ సమయంలో బీజేపీ ముఖ్యనేతలు అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement