CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Singapore tour updates(CMO)

Delhi, January 17:  సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.

చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ... సింగపూర్ మంత్రితో జరిపిన చర్చల వివరాలతో పాటు ఫోటోలను ఎక్స్ ద్వారా వెల్లడించింది తెలంగాణ సీఎంవో.   ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, టూరిజం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కులు మరియు ఇతర రంగాలలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిపింది తెలంగాణ సీఎంవో. ఈ పర్యటన విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.

CM Revanth Reddy Singapore tour updates

3 రోజులు సింగపూర్ లో పర్యటించనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం అవుతారు రేవంత్. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement