CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ

ఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు.

CM Revanth Reddy To meet PM Modi Today(X)

Delhi, Feb 26:  సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డుపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్(Revanth Reddy To meet PM Modi).

అలాగే కాంగ్రెస్‌ పెద్దలతోనూ సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు రేవంత్. ఇక మహా శివరాత్రి వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ, ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఇక ప్రధానితో భేటీ సందర్భంగా ప్రధానంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై(BC Reservations) చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని అభ్యర్థించనున్నారు.

ఇక కాంగ్రెస్ అధిష్టానం పెద్ధలతో భేటీ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement