PG Medico Attempts Suicide: ర్యాగింగ్ భూతమేనా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని, పరిస్థితి విషమం

తెలంగాణలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (PG Medico Attempts Suicide) కలకలం రేపింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు (suicide by injection at MGM in Warangal ) యత్నించింది.

MGM in Warangal (Photo-Video Grab)

Warangal, Feb 22: తెలంగాణలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (PG Medico Attempts Suicide) కలకలం రేపింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు (suicide by injection at MGM in Warangal ) యత్నించింది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. కాగా సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అర్థరాత్రి ఆ పని కోసం ప్రియురాలి గదికి, బాత్ రూంలో దాక్కుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబులైన భర్త, వరంగల్ జిల్లాలో షాకింగ్ ఘటన

హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు.

యువతి పెళ్లికి ఒప్పుకోలేదని అంకుల్ దారుణం, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకువచ్చి కత్తితో పొడుస్తూ అమానవీయ ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్, రంగంలోకి దిగిన పోలీసులు

మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్‌ తెలిపారు. శ్వాస తీసుకోవడంలో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్‌ జరిగిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. సీనియర్‌ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement