TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త బస్‌డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి, పెద్దపల్లి బస్ డిపో నిర్మాణానికి నిధుల కేటాయింపు

కొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు.

TGSRTC Board takes key decision new bus depos and bus stands(X)

Hyd, Jan 18:  కొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు కొత్త బస్సు డిపోల నిర్మాణం కోసం నిధులు కేటాయింపులకు అనుమతులు ఇచ్చారు.

పెద్దపల్లిలో కొత్త బస్సు డిపో నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు కేటాయింపులకు అనుమతులు ఇవ్వగా ములుగు జిల్లా ఏటూరునాగారం బస్సు డిపో కోసం రూ.6.28 కోట్లు, ములుగులో కొత్త బస్ స్టాండ్ కోసం రూ.5.11 కోట్లు, మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51 లక్షలు కేటాయించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌‌ కు రూ. 3.75 కోట్లు కేటాయింపు, ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10.00 కోట్లు, సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 17.95 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.   వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు..సత్ఫలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్

పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలు, జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చింది ఆర్టీసీ బోర్డు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

Share Now