Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

TSPSC (Photo-Wikimedia Commons)

Hyd, Mar 17: తెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం గ్రూప్ 1 ప్రిలిమ్స్, AEE , DAO పరీక్షలను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-I ప్రిలిమినరీ పరీక్ష కోసం సవరించిన పరీక్ష తేదీ ఇప్పుడు జూన్ 11న షెడ్యూల్ చేయబడింది. AEE,  DAO పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రశ్నపత్రం లీకేజీల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

"ఈరోజు ఉదయం 11:30 గంటలకు కమిషన్ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది.  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను జాగ్రత్తగా పరిశీలించి, కమిషన్ నిర్వహించిన అంతర్గత విచారణ తర్వాత, పై మూడు పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించామని అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 11 జూన్, 2023న మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాం. ఇతర పరీక్షల పునః నిర్వహణ తేదీలు త్వరలో తెలియజేయబడతాయని TSPSC ప్రకటనలో తెలిపింది.

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్, నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమంటూ మండిపాటు

గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. కమిషన్‌ తాజా నిర్ణయంపై గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జ‌న‌వ‌రి 13వ తేదీ (శుక్ర‌వారం) విడుద‌ల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement