Hafiz Saeed Sentenced: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుకు 31ఏళ్లు జైలు శిక్ష, పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు, ముంబై పేలుళ్ల మాస్టర్‌మైండ్‌ హఫీజ్ సయీద్‌కు షాక్, రెండు కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు

ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. అతడికి సంబంధించిన అన్ని ఆస్తులను సీజ్‌ చేయాలని ఆదేశించింది.

Hafiz Saeed. (Photo Credits: PTI/File)

Islamabad, April 09: ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు (Hafiz Saeed) పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష (Sentenced) విధించింది. రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. అతడికి సంబంధించిన అన్ని ఆస్తులను సీజ్‌ చేయాలని ఆదేశించింది. వీటితోపాటు హఫీజ్‌ నిర్మించినట్లు భావిస్తున్న మసీదుతోపాటు మదర్సాలను కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. 2008లో ముంబయిలో జరిపిన పేలుళ్లతో (Mumbai Blasts) ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. దానితో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు.

అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హఫీజ్‌పై (Hafeez) అమెరికా కోటి డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి పేర్కొన్న మోస్ట్‌వాంటెడ్‌ (Most wanted) ఉగ్రవాదుల జాబితాలోనూ హఫీజ్‌ ఉన్నాడు. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతోపాటు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.

Imran Khan: సుప్రీంకోర్టు తీర్పు బాధించింది! కానీ గౌరవిస్తా, భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ కీలక కామెంట్లు, భారత్ విదేశాంగ విధానం సూపరంటూ ప్రశంసలు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఖాన్ కీలక ప్రసంగం

ఇటీవల రెండు కేసుల్లో (2020) హఫీజ్‌కు 15ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయినప్పటికీ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విషయం చిమ్మే ప్రసంగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి వస్తున్నప్పటికీ చర్యలు మాత్రం అంతంత మాత్రమేననే ఆరోపణలున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement