RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన

ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.

2000 Notes (Photo Credits: Pixabay)

Hyderabad, Nov 5: ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు (RBI 2000 Notes) ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి. ఈ మేరకు  ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2023 మే 19న రూ.2 వేల నోట్లు ఉపసంహరించినట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

ఇప్పటికీ ఇవ్వొచ్చు

దేశంలో చలామణి అయిన రూ.2వేల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ఇప్పటివరకూ ప్రజల నుండి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లుగా ఆర్బీఐ తెలిపింది. రూ.6,970 కోట్ల విలువ కల్గిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికీ, ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ నోట్లను తీసుకుంటున్నారు.

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement