Bihar University: ఇదెక్కడి విచిత్రంరా బాబు! 100కు 151 మార్కులు వేసిన బీహార్ యూనివర్సిటీ, మార్కుల మెమో చూసి బిత్తరపోయిన స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కు 151 మార్కులు, అకౌంట్స్ విద్యార్ధికి సున్నా మార్కులు, బీహార్ యూనివర్సిటీ లీలలు
రోజు 24 గంటలు కష్టపడి చదివితే కూడా పరీక్షల్లో 100కు వంద మార్కులు రావడం కష్టమే. కానీ బీహార్లో (Bihar) ఓ విద్యార్ధికి 100కు ఏకంగా 151 మార్కులు వచ్చాయి. దీంతో బిత్తరపోవడం విద్యార్ధి వంతయింది. బీహార్లోని (Bihar) దర్బంగా జిల్లాకు (Darbhangas) చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీ (Lalit Narayan Mithila University) ఈ ఘనకార్యానికి పాల్పడింది.
Darbhanga, July 31: రోజు 24 గంటలు కష్టపడి చదివితే కూడా పరీక్షల్లో 100కు వంద మార్కులు రావడం కష్టమే. కానీ బీహార్లో (Bihar) ఓ విద్యార్ధికి 100కు ఏకంగా 151 మార్కులు వచ్చాయి. దీంతో బిత్తరపోవడం విద్యార్ధి వంతయింది. బీహార్లోని (Bihar) దర్బంగా జిల్లాకు (Darbhangas) చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీ (Lalit Narayan Mithila University) ఈ ఘనకార్యానికి పాల్పడింది. బీఏ (హనర్స్) చదువుతున్న ఓ విద్యార్ధికి పొలిటికల్ సైన్స్ లో (Political Science paper) ఏకంగా 100కు 151 మార్కులు (151 out of 100 ) వేశారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్లో తన మార్కులను చూసుకున్న విద్యార్ధి షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
అయితే మరో విద్యార్ధికి కూడా అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ పేపర్లో సున్నా మార్కులు వచ్చినట్లు ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇచ్చారు. మెరిట్ స్కూడెంట్ అయిన తనకు...జీరో మార్కులు రావడంతో యూనివర్సిటీని సంప్రదించాడు. దాంతో ఈ ఇద్దరు విద్యార్ధుల మార్కుల వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది.
అయితే తప్పు ఎక్కడ జరిగిందని విచారణ జరిపిన అధికారులకు...అసలు విషయం అర్ధమయింది. టైపింగ్ మిస్టేక్ (typographical errors) వల్ల ఈ ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని గుర్తించారు. దాంతో వారికి కొత్త ప్రొవిజనల్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 100కు 151 మార్కులు వచ్చాయన్న వార్తలు వైరల్గా మారడంలో ఆ యూనివర్సిటీకి చెందిన మిగిలిన విద్యార్ధులు తమకు కూడా టైపింగ్ మిస్టేక్ వల్ల తక్కువ మార్కులు వచ్చాయోమో అనే అనుమానంలో పడ్డారు.