Stock Limits On Tur Urad Dal: కందిపప్పు, మినపపప్పు నిల్వలపై కేంద్రం పరిమితులు, రేట్లు పెరిగే అవకాశముందని ప్రజల్లో ఆందోళన

దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Stock Limits On Tur, Urad Dal (PIC@Wikimedia Commons Pixabay)

New Delhi, June 03: దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని  (Stock Limits On Tur, Urad Dal) కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిమితులు ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం తన ప్రకటనలో స్పష్టంచేసింది. హోల్‌ సేలర్స్‌, రిటెయిలర్స్‌, బిగ్‌ చైన్‌ రిటెయిలర్స్‌, మిల్లర్లు, దిగుమతిదారులు అందరికీ ఈ పరిమతులు వర్తిస్తాయని పేర్కొంది. హోల్‌సేలర్స్ 200 మిలియన్‌ టన్నులకు మించి కంది, మినప పప్పు స్టాక్‌ ఉంచుకోకూడదని కేంద్రం తన ప్రకటనలో ఆదేశించింది.

WHO Alert on Chicken: చికెన్ ఎక్కువగా తింటే చాలా డేంజర్, ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ వ్యాధి బారీన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక 

ఇక రిటెయిలర్‌లు 5 మిలియన్‌ టన్నులకు మించి, బిగ్‌ చెయిన్‌ రిటెయిలర్‌లు () ప్రతి రిటెయిలర్‌ దగ్గర 5 మిలియన్‌ టన్నులకు మించి కంది, మినపపప్పు నిలువలు ఉంచుకోకూడదని కేంద్రం ఆదేశాల్లో పేర్కొన్నది. ఇక మిల్లర్‌లు గత మూడు నెలల్లో వచ్చిన స్టాక్‌ లేదా ఆ మిల్లు వార్షిక కెపాసిటీలో 25 శాతం రెండింట్లో ఏది ఎక్కువైతే అంతకుమించి కంది, మినపపప్పులను నిలువ ఉంచుకోవద్దని ఆదేశించింది. అదేవిధంగా దిగుమతిదారులు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వచ్చిన తేదీ నుంచి 30 రోజులకు మించిన స్టాక్‌ను నిలువ ఉంచుకోవద్దని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement