H3N2 Virus Scare: వణికిస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్, పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పుదుచ్చేరి ప్రభుత్వం

కరోనా తర్వాత దేశాన్ని హెచ్‌3ఎన్‌2 వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్‌ పుదుచ్చేరిలో కూడా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

కరోనా తర్వాత దేశాన్ని హెచ్‌3ఎన్‌2 వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్‌ పుదుచ్చేరిలో కూడా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా H3N2 వైరస్‌ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు

గత వారం ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2 మార్చి 5 మధ్య భారత్‌లో 451 హెచ్‌3ఎన్‌2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్‌ కారణంగా మొదటి మరణం నమోదైంది.కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు.

కరోనాకు కొత్త వైరస్‌కు మధ్య తేడాలు ఇవే, దగ్గు అదే పనిగా వస్తుంటే ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా సోకినట్లే, ఓ సారి లక్షణాలు తెలుసుకోండి

హెచ్‌3ఎన్‌2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement