Second Wave in India: భారత్‌లో కరోనా భీకర దృశ్యం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3.79 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 3,645 మరణాలు నమోదు, 30 లక్షలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

ఇండియాలో పరిస్థితులను చూసి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, తైవాన్ తదితర దేశాలు అత్యవసర సహయం అందించేందుకు ముందుకువచ్చాయి. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ రెగ్యులేటర్లు మరియు ఇతర వైద్య సామాగ్రితో యూఎస్ సి -5 విమానం కాలిఫోర్నియా నుండి ఇప్పటికే బయలుదేరింది, రేపు దిల్లీలో ల్యాండ్ అవుతుంది.

Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, April 29:  ప్రస్తుతం భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల గణాంకాలు చూస్తుంటేనే గుండెనొప్పి వచ్చేలా భీకర వాతావరణం నెలకొని ఉంది. ఏప్రిల్ 29 నాటికి భారత్‌లో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు సుమారు 3.80 లక్షల మార్కును తాకింది. అలాగే ఒక్కరోజులోనే 3 వేలకు పైగా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.

ఇండియాలో పరిస్థితులను చూసి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, తైవాన్ తదితర దేశాలు అత్యవసర సహయం అందించేందుకు ముందుకువచ్చాయి. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ రెగ్యులేటర్లు మరియు ఇతర వైద్య సామాగ్రితో యూఎస్ సి -5 విమానం కాలిఫోర్నియా నుండి ఇప్పటికే బయలుదేరింది, రేపు దిల్లీలో ల్యాండ్ అవుతుంది.

ఈ తెల్లవారుజామున రష్యా నుంచి రెండు విమానాలు 20 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్ మానిటర్లు మరియు 22 మెట్రిక్ టన్నుల మందులను తీసుకువచ్చాయి. తైవాన్ దేశం కూడా ఇండియాకు తక్షణ సాయంగా 150 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను పంపుతున్నట్లు ప్రకటించింది.

ఇక, గురువారం భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 63 వేలకు పైగా  కేసులు,  కర్ణాటక నుంచి సుమారు 39 వేలు, కేరళ నుంచి సుమారు 35 వేల కేసులు వెలుగుచూశాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,645 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,04,832 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,69,507 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,50,86,878 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 30,84,814 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 82.10 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.79 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 28 నాటికి దేశవ్యాప్తంగా 28,44,71,979 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,68,190 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 15 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 15,00,20,648 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement