MP Shocker: మానవ మృగాలకు చిక్కిన మూగ చెవిటి బాలిక, ఆరు మంది సామూహిక అత్యాచారం, తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక విలపించిన బాధితురాలు, ఎట్టకేలకు సంజ్ఞల ద్వారా పోలీసులకు తెలిపిన బాలిక

మధ్యప్రదేశ్‌ షాదోల్‌లో మూగ చెవిటి బాలికపై మానవ మృగాలు (Madhya Pradesh Shocker) విరుచుకుపడ్డాయి. బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Deaf-mute girl raped by 6) ఒడిగట్టారు.

Representational Image (Photo Credits: File Image)

Bhopal, Oct 2: మధ్యప్రదేశ్‌ షాదోల్‌లో మూగ చెవిటి బాలికపై మానవ మృగాలు (Madhya Pradesh Shocker) విరుచుకుపడ్డాయి. బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Deaf-mute girl raped by 6) ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు.

అప్పటికే అక్కడ మరో ఐదుగురు కాపు కాస్తున్నారు. అనంతరం మొత్తం ఆరుగురు ఆ అభాగ్యురాలిపై అత్యాచారానికి (Minorl Girl Rape) పాల్పడ్డారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం బాధితురాలిని ఇంటివద్ద వదిలేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక ఇంట్లో చెప్పుకోలేపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వెలుగుచూడటంతో విషయం తండ్రికి తెలిసింది. కుమార్తెను ఆరా తీయగా ఆమె బోరుమంది. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

జ్వరంతో ఉన్నా..బాలికను వదలని కామాంధుడు, ఇంజక్షన్‌ ఇవ్వాలంటూ ఆస్పత్రిలో అత్యాచారం, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికను విచారించగా పలు సంజ్ఞల ద్వారా వారికి కూడా విషయాన్ని తెలియజేసింది. దీంతో పలు అనుమానితుల ఫొటోలను పోలీసులు బాలికకు చూపించగా.. నిందితులను ఆమె గుర్తించింది. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ అవధేశ్‌ గోస్వామి వెల్లడించారు. అయితే అందులో నలుగురు మైనర్లేనని పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement