Niti Aayog Meeting Updates: మోడీ 3.0, నీతి అయోగ్ సమావేశం, ఎన్డీయే కూటమి సీఎం నితీష్ సహా పలువురు సీఎంల డుమ్మా, వికసిత్ భారత్ -2047నే ప్రధాన ఎజెండా

కేంద్రంలో నరేంద్రమోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమమైంది. ఢిల్లీలోకి రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు,

Niti Aayog Meeting Updates PM Modi to chair Niti meeting, discussions on Viksit Bharat 2047

Delhi, July 27: కేంద్రంలో నరేంద్రమోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమమైంది. ఢిల్లీలోకి రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ -2047 ఏజెండగా ఈ సమావేశం జరుగుతోంది.

ఈ సమావేశాన్ని ఇండియా కూటమి సీఎంలు బహిష్కరించారు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాకపోవడం గమనార్హం.

వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలని భావిస్తున్నామని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపోందించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతోంది.

దీంతో పాటు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామం, గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పలు అంశాలపైనా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు సలహాలు, సూచనలు చేయనున్నారు.

ఈ సమావేశంలో మూడవ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులపైనా చర్చ జరగనుంది. తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్య, భూమి,సైబర్ సెక్యూరిటీ, వంటి అంశాలను నీతిఆయోగ్ 9వ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు. హైదరాబాద్‌ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే

CM Revanth Reddy Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేంద్రానికి సవాల్ చేస్తున్నానని వెల్లడి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి

PM Modi on Illegal Indian Immigrants: అమెరికాలోని భారత అక్రమ వలసదారులపై ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన.. వారికి అమెరికాలో నివసించే హక్కు లేదని వెల్లడి, వెనక్కి తీసుకొస్తామని ప్రకటన

PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్‌ తో ప్ర‌ధాని మోదీ భేటీ.. ట్రేడ్‌, సుంకాలు, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చ‌.. ప్ర‌ధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్‌.. శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంద‌న్న మోదీ

Share Now