Uttar Pradesh: ప్రధాని పేరు తెలియదన్న వరుడు, పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అతని తమ్ముడిని పెళ్లాడిన వధువు, యూపీలో విచిత్రకర ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నాసిర్‌పూర్ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వరుడికి ప్రధాని ఎవరో తెలియదన్న కారణంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది.

Wedding Representational Image

Lucknow, June 21: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నాసిర్‌పూర్ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వరుడికి ప్రధాని ఎవరో తెలియదన్న కారణంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. నసీర్‌పూర్‌ గ్రామానికి చెందిన శివశంకర్‌రామ్‌కు కరందలోని బసంత్‌ పట్టిలో నివాసం ఉంటున్న యువతితో వివాహం జరగాల్సి ఉంది.

హిందూ ఆచారాల ప్రకారం జూన్ 11వ తేదీని వివాహానికి పవిత్రమైన రోజుగా నిర్ణయించారు. జూన్ 11న శివశంకర్ పెళ్లి ఊరేగింపుతో కాబోయే భార్య ఇంటికి చేరుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఉదయం జరిగిన ఖిచ్డీ వేడుకలో వరుడు తన మరదలు, బావమరిదితో సరదాగా గడిపారు. ఈ క్రమంలో శివశంకర్‌కు ఆమె మరదలి నుంచి ప్రశ్న ఎదురైంది. మన దేశానికి ప్రధాని ఎవరు అని ఆమె ప్రశ్నించారు.

బౌల్డ్ అయ్యాడని బౌలర్ గొంతు కోసి చంపిన బ్యాటర్, కాన్పూర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన

కానీ శివశంకర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడున్న వారంతా శివశంకర్‌ని ఎగతాళి చేశారు. ‘ప్రధాని పేరు మీకు తెలియకపోతే ఎలా’ అంటూ ఆయనను అవమానించారు. దీన్ని ఘోర అవమానంగా భావించిన అతని భార్య శివశంకర్ తమ్ముడు అనంత్‌ను అక్కడికక్కడే పెళ్లి చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వరుడి తండ్రి తెలిపారు.

వీడియో ఇదిగో, ఆవుపై పులి దాడి, వెంటాడి పులిని తరిమి తరిమి కొట్టిన ఆవుల మంద, రాత్రంతా గాయపడిన ఆవుకు కాపలాగా నిలిచిన మిత్రులు

తమకు ఏ పార్టీ నుంచి ఫిర్యాదు అందలేదని సైద్‌పూర్ కొత్వాల్ వందనా సింగ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఓ యువకుడు స్టేషన్‌కు వచ్చి.. ప్రధాని పేరు వెల్లడించకపోవడంతో తన పెళ్లి ఆగిపోయిందని చెప్పాడు. కుటుంబ సభ్యులను పిలిపించి యువకుడిని వెనక్కి పంపించారు. ఈ విషయమై రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకుంటామని కొత్వాల్ సింగ్ తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement