Willful Defaulters Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసు, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ, స్కామర్లంతా బీజేపీ సన్నిహిత మిత్రులేనన్న కాంగ్రెస్ ఎంపీ

భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను (Willful Defaulters Case) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై (Modi Govt) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో బీజేపీ సన్నిహిత మిత్రులే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

Rahul Gandhi | File Image | (Photo Credits: PTI)

New Delhi, April 29: భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను (Willful Defaulters Case) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై (Modi Govt) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో బీజేపీ సన్నిహిత మిత్రులే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు, అన్నీ పార్టీలతో కలిసి పనిచేయాలి, మీడియాతో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ

సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే సమాచార హక్కు చట్టం ( Right To Information (RTI) కిందట కోరిన మీదట ఆర్‌బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందచేసింది. ఈ జాబితా ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ పాలక బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టింది.

బ్యాంకులను మోసం చేసిన 50 మంది ప్రముఖ ఎగవేతదారుల జాబితాలో పాలక పార్టీ మిత్రులే ఉన్నందున బీజేపీ పార్లమెంట్‌లో ఈ జాబితాను వెల్లడించలేదని అన్నారు. అత్యధిక మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగవేసిన 50 మంది పేర్లను చెప్పాలని తాను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారని రాహుల్‌ చెప్పుకొచ్చారు.

Here's Saket Gokhale Tweet

మంగళవారం(ఏప్రిల్-28,2020)కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో...నేను పార్లమెంట్ లో ఒక సాధారణ ప్రశ్న అడిగాను. 50 మంది అతిపెద్ద బ్యాంక్ స్కామర్ల పేర్లను చెప్పమని అడిగాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు ఆర్బీఐ... నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మరియు ఇతర బీజేపీ స్నేహితుల పేర్లను లిస్ట్ లో పెట్టింది. ఇందుకే బీజేపీ..పార్లమెంటు ముందు నిజం దాచిపెట్టారంటూ తాను పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

దేశంలో ప్రముఖ లోన్‌ డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా వీరి రుణాలను ఎందుకు రద్దు చేశారో వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ దురుద్దేశాలను ఈ జాబితా ప్రతిబింబిస్తోందని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని నిలదీశారు. దేశంలోని అగ్ర రుణ ఎగవేతదారుల జాబితాను కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విడుదల చేశారు. వారి రుణాలు ఎందుకు మాఫీ చేశారనే దానిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Here's Randeep Singh Surjewala Tweet

ఇది డూప్‌ను ప్రోత్సహించే క్లాసిక్ కేసు అని, మోసం మరియు నిష్క్రమణ" విధానాన్ని ప్రోత్సహించే మోడీ ప్రభుత్వ పాలసీ అని, దీనిని ఇకపై అంగీకరించలేమ ని,ప్రధాని సమాధానం చెప్పాలని అని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో అన్నారు. ఇది మోడీ ప్రభుత్వం యొక్క... తప్పుగా భావించిన ప్రాధాన్యతలను మరియు నిజాయితీ లేని ఉద్దేశాలను ప్రతిబింబిస్తుందని సుర్జేవాలా అన్నారు.

వేల కోట్ల రూపాయలను భారతీయల బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాతో సహా 50 మంది ఎగవేతదారుల 68,607 కోట్ల రూపాయల రుణాలను మోడీ సర్కార్ "మాఫీ" చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 నుండి 2019 సెప్టెంబర్ వరకు రూ .6.66 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now