Power Outage During President Address: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతుండగా 9 నిమిషాలపాటు పోయిన కరెంట్.. చీకట్లోనే ప్రసంగం.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఘటన.. వీడియో వైరల్

రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.

President Murmu (Credits: Twitter)

Bhubaneswar, May 7: ఒడిశాలో (Odisha) మూర్‌భంజ్ జిల్లా బరిపదలోని మహారాజ శ్రీరామచంద్ర భంజదేవ్ వర్సిటీలో నిన్న స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రప్రతి ప్రసంగిస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకున్నది. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. అసలేమైందంటే.. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.

FM Radio In Smart Phone: స్మార్ట్ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో ఉండాల్సిందే.. సమాచార వ్యాప్తిలో డిజిటల్ అంతరం తగ్గించేందుకు ఎఫ్‌ఎం అవసరమన్న కేంద్రం.. మొబైల్ ఫోన్ల తయారీదారులకు ఆదేశాలు

చీకటి, వెలుగులను సమానంగా చూడాలని

పోడియం నుంచి వస్తున్న వెలుతురు మధ్య రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చీకటి, వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

US Mass Shooting Incident: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నిందితుడు సహా 9 మంది దుర్మరణం.. కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement