Flight Over Tirumala: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం.. ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు

తిరుమలలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Credits: Twitter

Tirumala, June 5: తిరుమలలో (Tirumala) కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం (Flight) తిరుమల శ్రీవారి ఆలయానికి (Tirumala Srivari Temple) సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే, విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, గమ్యస్థానం (Destination Place) ఏమిటనేది ఇంకా తెలియాల్సిఉంది.  ఆగమశాస్త్రం ప్రకారం.. శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం. అయితే, ఇటీవల విమానాలు ఆలయానికి సమీపం నుంచి వెళ్లిన ఘటనలు తరుచూ వెలుగు చూశాయి. ఇక తాజా ఘటనపై విమానయాన శాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

CBI Probe in Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ, నిందితులను గుర్తించామన్న కాసేపటికే మాట మార్చిన రైల్వే మంత్రి, మృతుల సంఖ్యను తగ్గిస్తూ సవరణ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement