Marries Lord Krishna: 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తె.. ఎవరూ పెళ్ళికి ముందుకు రాకపోవడంతో తండ్రి సంచలన నిర్ణయం.. శ్రీకృష్ణ భగవానుడికి కుమార్తెను ఇచ్చి వివాహం.. హాజరైన బంధుమిత్రులు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

ఓ తండ్రి తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన ఈ వివాహం వెనక ఆ తండ్రి ఆవేదన ఉంది. గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది.

Marriage (Credits: Twitter)

Gwalior, Nov 11: తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి (Lord Krishna) ఇచ్చి వివాహం (Marriage) జరిపించాడు ఓ తండ్రి. ఈ పెళ్లికి బంధుమిత్రులు (Relatives) పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంబురంతో ఆనందభాష్పాలు రాల్చారు. టాక్ ఆఫ్ ద టౌన్‌గా (Talk of the town) మారిన ఈ వివాహం వెనక ఆ తండ్రి ఆవేదన ఉంది. గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆమె మాట్లాడలేదు, చెవులు వినబడవు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం జరగడం ఇక కాని పని అని నిర్ణయించుకున్న ఆయన.. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు.

సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దదైన నక్షత్రంలో భారీ విస్ఫోటనం... మృతనక్షత్రంగా మారిన వైనం.. రికార్డు చేసిన హబుల్ టెలిస్కోప్

అనుకున్నదే ఆలస్యం.. కుమార్తెకు వివాహం నిశ్చయించామని, తప్పకుండా రావాలంటూ బంధుమిత్రులకు ఫోన్లు చేసి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడితో వివాహం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ అందరూ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లిలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆహ్వానించారు. ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement