Jammu and Kashmir: పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం, ఆ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్‌

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. గండిపొరాలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సోమవారం సాయంత్రం గాలింపు ప్రారంభించారు.

Representational Image (Photo Credits: PTI)

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గండిపొరాలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సోమవారం సాయంత్రం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఓ ఉగ్రవాది మరణించాడని, మరో ఉగ్రవాది దాక్కున్నాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారిని జైషే మహమ్మద్‌ (JEM) ఉగ్రవాదులు గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement