Suicide Caught on Camera: తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు
ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తండ్రీకొడుకులు స్థానిక రైల్వే స్టేషన్ పట్టాల పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భయందర్ రైల్వే స్టేషన్లోని 6వ నంబర్ ప్లాట్ఫాంపై సోమవారం నాడు జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తండ్రి పేరు హరీష్ మెహతా, కొడుకు పేరు జై మెహతాగా గుర్తించారు.
ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తండ్రీకొడుకులు స్థానిక రైల్వే స్టేషన్ పట్టాల పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భయందర్ రైల్వే స్టేషన్లోని 6వ నంబర్ ప్లాట్ఫాంపై సోమవారం నాడు జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తండ్రి పేరు హరీష్ మెహతా, కొడుకు పేరు జై మెహతాగా గుర్తించారు. వీరిద్దరూ విరార్ నుంచి చర్చిగేట్కు వెళ్తున్న లోకల్ ట్రైన్ ముందు దూకి ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ వసాయ్ నివాసితులని చెబుతున్నారు. రైల్వే అధికారులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై వసాయ్ జీఆర్పీ విచారణ ప్రారంభించింది. వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు
Here's Video