Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో అమానుషం..ఆటో డ్రైవర్పై యువతి దాడి, సారీ చెప్పినా వినకుండ దాడి చేసిన యువతీ, వీడియో ఇదిగో
ఆటో డ్రైవర్ పై ఓ యువతి దాడికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదనపు చార్జీ అడిగినందుకు మార్గ మధ్యలో ఆటో ఆపి పిడిగుద్దులు కురిపించింది యువతి.
డ్రైవర్ క్షమాపణ చెబుతున్నా వినకుండా చెంప పగలగొట్టింది. ఆటో డ్రైవర్ పై దాడి చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అలాగే ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది. బస్సులో మహాకుంభమేళాకు భైంసా యాత్రీకుల ప్రయాణం చేస్తుండగా ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం కాగా ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. మహా కుంభమేళాకు వచ్చి అస్వస్తతకు గురైన దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని తెలిపిన కైలాసానంద గిరి మహారాజ్
Young woman attacks auto driver at Uttar Pradesh