Bishan Singh Bedi Dies: బిషన్‌ సింగ్‌ బేడీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం, భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతమని వెల్లడి

భారత క్రికెట్‌ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు.

PM Narendra Modi Condoles Demise of Spin Legend, Says 'He Will Continue To Inspire Future Generations of Cricketers'

భారత క్రికెట్‌ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు.బిషన్‌ సింగ్‌ బేడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. క్రికెట్‌ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని.. తన స్పిన్‌ బౌలింగ్‌తో భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతంగా నిలుస్తారని పేర్కొన్నారు. బిషన్‌ సింగ్‌ బేడీ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement