Corona in AP: ఏపీలో తాజాగా 415 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. అదే సమయంలో 584 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,356కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,45,276 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,655 మంది చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement