Jagananna Vidya Deevena: మరి కాసేపట్లో జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల, రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ఏపీ సీఎం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు.

AP CM YS Jagan (Photo-Twitter)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement