Geethanjali Suicide Case: గీతాంజలిని రైలు నుంచి తోసేసిన ఆ ఇద్దరు ఎవరు, ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ, కౌంటర్ విసురుతున్న వైసీపీ సోషల్ మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి మృతి చుటూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చేసిన ట్రోల్స్ వల్లనే గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనిది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Geethanjali Suicide Case

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి మృతి చుటూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చేసిన ట్రోల్స్ వల్లనే గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనిది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎవరో అమ్మయిని రైలు కింద కి నెట్టేశారు. అవునా.. బ్రతికే ఉందా.. ఏమో.. తెలియదు. ఇంతకు ఆమెను తోసేసింది ఎవరు..? ఏమో తెల్వదు.. ఇద్దరు నెట్టేసి పారిపోయారు.. అని చర్చించుకోవడం ఆ వీడియోలో వినిపించింది.గీతాంజలిని రైలు కిందకు తోసేసింది ఎవరు.. నిజాలు బయటకు రావాలంటే టీడీపీ ప్రశ్నించింది. అయితే ఎక్కడో జరిగిన వీడియోకి ఆడియో మిక్సింగ్ చేశారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వేదికగా కౌంటర్ విసురుతున్నారు.  గీతాంజలి మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య, ఎవరిని వదిలిపెట్టేది లేదని వెల్లడి

Here's TDP X Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement