Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Madhavaram Krishna Rao (Photo-X)

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రోళ్లను, సినిమావాళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా అంటూ మాధవరం ఫైర్ అయ్యారు. ఈ ప్రాంత శాసస సభ్యుడిగా ఈ రకమైన ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ వాళ్లే కాదు.. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడిన సహించేది లేదన్నారు. శిక్షణ తరగతుల్లో ఆ పార్టీల ఎమ్మెల్యేలు నేర్చుకుంది ఇదేనా? అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమను ఆనాడు మాజీ సీఎం చెన్నారెడ్డి ఎంతో కష్టపడి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారన్నారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారని గుర్తు చేశారు.

పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Kukatpally MLA Madhavaram Krishna Rao Slams Govt

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement