Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.

Paris Olympics 2024 Opening Ceremony

Paris, July 27: విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ (France) ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఒలింపిక్స్‌ ను (Paris Olympics 2024) అందరికీ చేరువ చేయలనే రీతిలో స్టేడియానికి పరిమితం కాకుండా నదిని వేదికగా మలుచుకుంటూ క్రీడాభిమానులను కనులవిందు చేసింది. సరిగ్గా శతాబ్దం తర్వాత విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న పారిస్‌ ను కలకాలం గుర్తుంచుకునే రీతిలో వేడుకలు అలరించాయి. దిగ్గజ ఫుట్‌ బాలర్‌ జినేదిన్‌ జిదానే చేతబూనిన ఒలింపిక్‌ టార్చ్‌ వీడియోతో మొదలై నదిపై ప్లేయర్ల మార్చ్‌ ఫాస్ట్‌ తో ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఆసాంతం కనువిందు చేశాయి.

ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

గ్రీస్‌ కు గౌరవార్థంగా పరేడ్‌ లో ముందు అవకాశం

ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌ కు గౌరవార్థంగా పరేడ్‌ లో ముందు అవకాశం ఇచ్చారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ వచ్చింది. 84వ దేశంగా భారత్ పరేడ్ నిర్వహించింది. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్స్‌ గా వ్యవహరించారు. అధికారులు, అథ్లెట్లు మొత్తం 78 మంది ఈ పరేడ్‌ లో పాల్గొన్నారు. వీరంతా ఈ ఆరంభ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సంప్రదాయ దుస్తులను ధరించారు. ప్రతీ ఒక్కరు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకొని అభివాదం చేశారు. భారత సంస్కృతి ప్రతిబింబించేలా అథ్లెట్లు మహిళా అథ్లెట్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు. పురుష అథ్లెట్లు షెర్వానీలో మెరిసారు. ఈ ఆరంభ వేడుకలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెన్ నదీ వెంబడి భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షం పడినా.. ఆరంభ వేడుకలు ఆగలేదు. భారత్ నుంచి మొత్తం 117 మంది పారిస్ ఒలింపిక్స్‌ బరిలో నిలిచారు. 16 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now