Andhra Pradesh: ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి, ఊపిరి పీల్చుకున్న వజ్రపుకొత్తూరు వాసులు, మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి దాన్ని సజీవంగా పట్టుకున్న రెస్క్యూ టీమ్‌

ఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు (Rescue team catches Bear) చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చిన రెస్క్యూ టీమ్‌.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది.

Rescue team catches Bear (Photo-Video Grab)

Srikakulam, June 21: ఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు (Rescue team catches Bear) చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చిన రెస్క్యూ టీమ్‌.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.నిన్నటి నుంచి కిడిసింగి శారదా పురం తోటలో నివసిస్తున్న ప్రజల్ని ఎలుగుబంటి భయభ్రాంతులకు గురిచేసింది.

ఆ క్రమంలోనే పలువురిపై దాడి చేసి గాయపర్చింది. ఈ దాడిలో ఓ రైతు మృతి చెందారు. దాంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. రెస్క్యూ టీమ్‌ సహాయంతో చివరకు దాన్ని పట్టుకున్నారు. ముందుగా ఓ ఇంట్లో ఎలుగుబంటి ఉన్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. అందుకోసం స్పెషల్‌ టీమ్‌ను రప్పించారు. ఆ తోటలో నివసిస్తు వారిని అప్రమత్తం చేసి వారి చేత ఇళ్లు ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఎలుగుబంటిని ప్రాణాలతో పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement