AP Assembly Session LIVE: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.
Vijayawada, July 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన మాజీ సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
పోలీసులతో జగన్ వాగ్వివాదం
అంతకుముందు అసెంబ్లీ గేటు ముందు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించారు. వీటిని లాక్కొన్న పోలీసులు వాటిని చించేశారు. పోలీసులపై సీరియస్ అయిన వైఎస్ జగన్.. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు.