Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.

AP Accident (Credits: X)

Vijayawada, Dec 10: ఏపీలోని (AP) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త ప్రమాదం నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. పోతవరానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ భార్య ఉమ, కుమారులు రోహిత్, మనోజ్ తో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వేకువజామున ఈ ప్రమాదం జరిగింది.

తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్, దర్యాప్తు చేస్తామని తెలిపిన పహాడీ షరీఫ్ పోలీసులు

Here's Video:

డ్రైవ్ చేసింది ఎవరంటే?

ఘటన జరిగిన సమయంలో ఉమ కారు డైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రమాదం జరగ్గానే స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్పకు క్రికెటర్ కృనాల్ పాండ్యాకు ఉన్న రిలేషన్ ఏంటి..? నెటిజన్లు ఎందుకు అతడిని కృనాల్ పాండ్యాతో కలుపుతున్నారు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement