Chandrababu on Alliance: ఏపీలో పొత్తులపై చంద్రబాబు కీలక కామెంట్స్, అలయన్స్‌కు టైమ్ వచ్చిందన్న బాబు, వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని.. తాము అధికారంలోకి వచ్చాక తడాఖా చూపెడతామన్నారు. పోలీసుల సాయం లేకుండా జగన్ బయటకు రాలేరని పేర్కొన్నారు.

File Image of Chandrababu Naidu | (Photo Credits: ANI)

Vijayawada, May 08: పొత్తులపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ జగన్ (YS Jagan) ఎగిరెగిరి పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గతంలో వైఎస్‌ఆర్‌- టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదా అని చంద్రబాబు (Chandra Babu) ప్రశ్నించారు. వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేయలేదా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని.. తాము అధికారంలోకి వచ్చాక తడాఖా చూపెడతామన్నారు. పోలీసుల సాయం లేకుండా జగన్ బయటకు రాలేరని పేర్కొన్నారు.

CM Jagan Review: వైఎస్సార్‌ రైతు భరోసాపై సీఎం జగన్ కీలక ఆదేశాలు, రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతల పొత్తు పలుకులు ఆసక్తికరంగా మారాయి. రెండ్రోజుల క్రితం పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని ముందుకొచ్చారు. అయితే ఎవరి త్యాగాలూ తమకు అవసరం లేదంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు షాకిచ్చారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ (BJP) త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మాత్రం పొత్తులపై నర్మగర్భంగా మాట్లాడారు. ఏపీ భవిష్యత్‌ కోసం చాలామంది కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అందరం కలిసి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పొత్తులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. డైరెక్ట్‌గా చెప్పినప్పుడు చంద్రబాబు ప్రస్తావనపై ఆలోచిస్తామన్నారు.

Bojjala Gopalakrishnareddy Dies: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఉమ్మడి ఏపీ మంత్రి 

చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachadra Reddy) అన్నారు. పొత్తులు లేకపోతే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తే ఓడిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

PMGKAY: ఉచిత రేషన్‌ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్‌ ప్లాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్లకు రేషన్ కట్ చేసేందుకు సన్నాహాలు

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

Share Now