Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

ఏపీలోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఘోరం జరిగింది. పాల డిపోకు వెళ్లి పాలు పోసి వస్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి తగబడ్డారు.

Representative Image (Photo Credits: IANS)

Vijayawada, Mar 8: ఏపీలోని (AP) అన్నమయ్య జిల్లా (Annamayya Dist.) నిమ్మనపల్లె మండలంలో ఘోరం జరిగింది. పాల డిపోకు వెళ్లి పాలు పోసి వస్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి తగబడ్డారు. యువతిని అటకాయించి నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యువతి వీడియోలో మాట్లాడారు. నిందితులను నాగేంద్ర, సురేంద్రగా యువతి పేర్కొంది. కేసు పెడితే చంపేస్తా అని నిందితులు బెదిరించినట్టు బాధితురాలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌ లో ఘటన (వీడియో వైరల్)

ఇదే మండలంలో మొన్న కూడా..

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలోనే ఇటీవల మరో  దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుపొరలు కమ్మి చిన్నారులైన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(28)కి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు. అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి 9, 7 ఏళ్ల వయసున్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వారించింది. అయినా భర్త ధోరణిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement