AP BRS President: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్‌గా జనసేన అగ్రనేత, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ రాజకీయం ఇదే..

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఇన్ చార్జీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Former IAS officer Thota Chandrasekhar (Image: Twitter)

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఇన్ చార్జీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈయన గతంలో జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2009లో గుంటూరు నుంచి పీఆర్పీ టికెట్‌పై లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విఫలమయ్యారు. 2019లో జనసేన టిక్కెట్‌పై గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో క్రియారహితంగా మారారు. తోట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!

చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. తోటతో పాటు మరికొందరు మాజీ ఐఏఎస్‌ అధికారులు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. బహుశా ఆ పార్టీ విద్యావంతులైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.

తోట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిర్ణయాత్మక కాపు సామాజికవర్గానికి చెందిన వారే. కాబట్టి, ఈ నియామకం రెండు విధాలుగా పనిచేస్తుంది. అయితే, తోట ఆకర్షణీయమైన నాయకుడు కాదు.  తోట రియల్ ఎస్టేట్  వ్యాపారంతో పాటు, న్యూస్ ఛానెల్, 99TV అధిపతిగా ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement