Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Hyderabad, Nov 9: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.
Here's Video:
యాగంటి దర్శనానంతరం మహానందికి
యాగంటి దర్శనానంతరం అఘోరీ మహానందికి బయలుదేరారు. ఆలయ మర్యాదలతో అఘోరీకి స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని అధికారులు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.