Pulasa Chepa: పులస చేపా.. మజాకా..!.. రూ. 24 వేలు పలికిన కేజిన్నర చేప.. ఏపీలో కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఈ పులస చేపల సందడి మొదలవుతుంది.

Fish

Vijayawada, July 13: ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప (Pulasa Chepa) రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో (Godavari Districts) ఈ పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేపల కోసం జాలర్ల వేట కూడా అదే స్థాయిలో సాగుతుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఇక ఆ జాలరికి పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. ఈ చేప మిగతా చేపల్లా ఈజీగా దొరకదు. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేప ఎంతో ప్రత్యేకమైంది. అలా ఇటీవల  గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో ఓ పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మకిలిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజిన్నర బరువున్న పులస చేప పడింది.

కాటేసిన పామును ఏకంగా దవాఖానకు తీసుకొచ్చిన యువకుడు.. యూపీలో ఘటన.. వీడియో మీరూ చూడండి!

పులస చేపా.. మజాకా

చేప ఇలా చిక్కిందో లేదో.. దాన్ని కొనుగోలు చేసేందుకు అందరూ పోటీపడ్డారు. అయితే, చివరకు అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను రూ. 24 వేలకు ఈ కేజీన్నర చెప్పాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement