Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన

తప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు.

Representational Picture (File Photo)

Prakasam, June 30: తప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి (Student) దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం (Exam Centre) ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై (College Principal) దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ షాకింగ్ ఘటన జరిగింది.  గొంట్ల గణేశ్ అనే విద్యార్థి స్థానిక  కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గతేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్భంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచీ అతడు ఆ కళాశాల ప్రిన్సిపల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిపోయాడు.

Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో

అకస్మాత్తుగా దాడి

స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డి‌పై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో గొంతు కోయబోతుంటే కొండారెడ్డి చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి కూడా గాయమైంది. స్థానికులు కొండారెడ్డిని ఆసుపత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement