AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.

Murder Representational image (Photo Credit- ANI)

Vijayawada, July 14: ఏపీలోని (AP) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో (Ambedkar Konaseema District) దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబు(Ewer)తో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన  అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..  మద్యానికి బానిసైన ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ తాగొచ్చి భార్యతో పాటూ తల్లిదండ్రులపైనా (Parents) చేయి చేసుకునేవాడు. భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టింది.

Viral Videos: కొసావో పార్లమెంటులో కుమ్మేసుకున్న చట్టసభ్యులు.. ప్రధాని ప్రసంగిస్తుండగా ముఖంపై నీళ్లు చల్లిన ప్రతిపక్ష నేత.. వీడియో ఇదిగో!

ఒక్క దెబ్బకు..

నారాయణమ్మ కొట్టిన ఒక్క దెబ్బకు రామకృష్ణ మరణించాడు. భర్త హింసను భరించలేకే అతడిని కడతేర్చినట్టు ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయింది. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement