Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Hyderabad, Dec 31: ఫార్ములా-ఈ కారు రేసుకు (Formula E-Car Race Case) సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా-ఈ రేస్ విషయంలో నిధుల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఏ తీర్పు వస్తుందో??
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇప్పటికే ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ, తుది తీర్పు నేడు వెల్లడించనున్నది. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే, కేటీఆర్ రాజకీయ జీవితానికి కీలకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)