HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

జీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

HYDRA Commissioner Ranganath (Photo-Video Grab)

Hyderabad, Jan 5: జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ లోని హైడ్రా కార్యాలయం ఉన్న బుద్ధ భవన్‌ లో ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో ఫిర్యాదుదారుడు రావాలని సూచించారు. ఈ విషయంలో అనుమానాలు ఉంటే హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పారు.

సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?

ఈ నంబర్లలో సంప్రదించవచ్చు

040-29565758, 040-29560596 నెంబర్లకు ఫోన్ చేసి కూడా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement