Telangana Student Dies In US: అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కారులో శవమై కనిపించిన యువకుడు.. బాధితుడు హనుమకొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు
అమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
Hyderabad, Dec 23: అమెరికాలో (America) తెలుగు విద్యార్థులు (Telugu Students) అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు నివాసం ఉంటున్నమిన్నెసొటాలోని అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో ఉన్న కారులో శవమై కనిపించాడు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు ఆదివారం నాడు సమాచారం ఇచ్చారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా తమను విడిచి వెళ్ళడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు. బండి వంశీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఎంఎస్ చదువుతూ.. పార్ట్ టైం జాబ్ చేస్తూ..
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు బండి రాజయ్య, లలిత దంపతుల రెండో కుమారుడు బండి వంశీ (25). గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఉంటున్న అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో పార్క్ చేసి ఉన్న ఓ కారులో వంశీ మృతిచెంది ఉండడం అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న హనుమకొండ జిల్లాకే చెందిన కొందరు యువకులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే వంశీ పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు.
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)