Temperature Rises In Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు ఎండలు.. రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

మొన్నటివరకూ వానలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణను మరో నాలుగు రోజులపాటు ఎండలు మండేలా చేయనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు పేర్కొంది.

Temperature in Telangana (Credits: Twitter)

Hyderabad, March 31: మొన్నటివరకూ వానలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణను (Telangana) మరో నాలుగు రోజులపాటు ఎండలు మండేలా చేయనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ (April) మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు (Temperature Rises) పేర్కొంది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు తెలిపింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Thunderstorms In Odisha: ఒడిశాలో పిడుగుల వాన.. అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి.. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో ఘటన.. పిడుగుపాటు శబ్దాలతో జనం బెంబేలు.. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలానే జరుగుతుందన్న అధికారులు

ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ యెల్లో అలర్ట్ హెచ్చరికను వాతావరణశాఖ జారీ చేసింది. ఆయా జిల్లాలో వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది.

Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement