Earthquake Alert System: భూకంపం రాకముందే మీ ఫోన్‌కి అలర్ట్ మెసేజ్, భారత్‌లో భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించిన గూగుల్

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ బుధవారం భారత్‌లో భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించింది. ఫలితంగా భూకంపం రాకముందే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తమై ఘటనాస్థలికి దూరమయ్యే అవకాశం ఉంటుంది.భూకంపం ప్రపంచంలో అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యం.

Representative Image (Image Credits: IANS)

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ బుధవారం భారత్‌లో భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించింది. ఫలితంగా భూకంపం రాకముందే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తమై ఘటనాస్థలికి దూరమయ్యే అవకాశం ఉంటుంది.భూకంపం ప్రపంచంలో అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యం.

గూగుల్ ప్రారంభించిన ఈ సిస్టమ్‌తో, భారతదేశంలోని ప్రజలు ముందస్తు హెచ్చరిక సందేశాలను స్వీకరించడం ద్వారా తమను మరియు తమ ప్రియమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలుగుతారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) మరియు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NSC)తో సంప్రదించి అభివృద్ధి చేసిన ఈ గూగుల్ సిస్టమ్ ద్వారా భూకంప హెచ్చరికలను ముందుగానే పొందుతారు.భూకంపాల తీవ్రతను తెలుసుకుంటారు.

ఈ కంపెనీల ఫోన్లు వాడే వారికి వాట్సాప్ షాక్, అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మెసేజింగ్ దిగ్గజం

ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సూక్ష్మ సీస్మోమీటర్‌లుగా పనిచేసే మైక్రో యాక్సిలెరోమీటర్‌లు అమర్చబడి ఉంటాయి. ఫోన్‌ను ఛార్జ్ చేసినప్పుడు, అది భూకంపం యొక్క ప్రారంభాన్ని గ్రహిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, చర్యలు తీసుకోవాలని ఒకటి రెండు రకాల హెచ్చరికలను గూగుల్ పంపనున్న సంగతి తెలిసిందే. భూకంపం తీవ్రత 4.5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, వినియోగదారుని అప్రమత్తం చేయడానికి వినియోగదారు ఫోన్ మూడు-నాలుగు సార్లు వైబ్రేట్ అవుతుంది. ఫోన్ డోంట్ డిస్టర్బ్ లేదా సైలెంట్ మోడ్‌లో ఉంటే, మొబైల్ స్క్రీన్‌పై హెచ్చరిక కనిపిస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement