Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు

Chandrayaan-3 Launch (Photo Credit: Twitter - @DDNewslive)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్‌–3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను (Chandrayaan-3 successfully leaves Earth's orbit) విజయవంతంగా చేపట్టారు.

ఇలా చంద్రయాన్‌–3 కక్ష్య దూరం మరోమారు పెంచారు.మిషన్ ఇప్పుడు చంద్రుని కక్ష్య వైపు ప్రయాణం (heads towards Moon) సాగించింది. ISTRAC వద్ద విజయవంతంగా పెరిజీ-ఫైరింగ్ నిర్వహించబడింది, ISRO అంతరిక్ష నౌకను ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం

చంద్రయాన్ 3 అక్కడ నుంచి ఐదు రోజులపాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఆ కక్ష్యలోకి వచ్చాక ఆగస్టు 23వ తేదీన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది.

ల్యాండర్‌ విచ్చుకుని లోపలి నుంచి రోవర్‌ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని అందిస్తుంది. అంటే చంద్రయాన్‌–3 మిషన్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరుకోవడానికి ఇంకా 17 రోజులు, చంద్రుడిపై దిగడానికి 23 రోజులు పడుతుందన్న మాట. చంద్రయాన్-3 మిషన్ షెడ్యూల్‌కు కట్టుబడి ఉందని, ప్రస్తుతం అంతరిక్ష నౌక ఆరోగ్యం సాధారణంగా ఉందని ఇస్రో అధికారులు తెలిపారు.

జూలై 14 మధ్యాహ్నం, చంద్రయాన్-3ని గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ Mk-III అని పిలిచే ఇస్రో ఆన్-బోర్డ్ లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 40 రోజుల ఫ్లైట్ తర్వాత, అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని భావిస్తున్నారు, చంద్రుని ఉపరితలంపై దిగిన నాల్గవ దేశంగా భారతదేశం..చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా నిలిచింది.

చంద్రయాన్-3 అనేది చంద్రయాన్-2కి తదుపరి మిషన్, ఇది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, రోవింగ్‌లో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యోమనౌక ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది, ఇది 100 కిమీ చంద్ర కక్ష్య వరకు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా తీసుకువెళుతుంది

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Share Now