Howdy, Modi: సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, మోదీ సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు. అమెరికా చరిత్రలో ఒక విదేశీ నాయకుడికి ఇంత ఆదరణ లభించడం ఇదే తొలిసారి

వచ్చే నెలలో అమెరికాలో Howdy, Modi వేడుకలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.

PM Narendra Modi to address Indo-Americans in his US tour in September, 19. | Photo Credits: Getty Images)

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో "Howdy, Modi" పేరుతో భారీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.

మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా (Live) వీక్షించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా మంది రిజస్టర్ అయ్యారు. సమావేశం దగ్గరపడే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే మోదీ సభకు ఇంత భారీగా మద్ధతు రావడం ఒక రికార్డు. గతంలో కూడా భారత ప్రధానులు అమెరికాలో సమావేశం నిర్వహించినప్పటికీ, ఈ స్థాయి స్పందన ఎప్పుడూ రాలేదు. ఉత్తర అమెరికాలో పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించే సభలకు మినహా ఏ విదేశీ నాయకుడికి కూడా ఇంత భారీ సంఖ్యలో స్పందన రావడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఐరాస జనరల్ అసెంబ్లీ ఎన్నికలు అమెరికాలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత ప్రధాని పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అయితే ఆ ఎన్నికలకు ముందుగానే మోదీ సభ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్ ఇండియా ఫోరమ్ (TIF) అధ్వర్యంలో హోస్టన్ లోని NRG స్టేడియం వేదికగా మోదీ సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనటానికి ఎవరైనా ఈ ఆగష్టు 29 వరకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో చాలా మంది ప్రవాస భారతీయులు నివాసముంటున్నారు. ఆ ఒక్క సిటీలోనే దాదాపు 1 లక్షా 30 వేలకు పైగా ప్రవాస భారతీయులున్నట్లు అధికారిక జనాభా లెక్కల ప్రకారం తెలుస్తుంది. మోదీ తన పర్యటనలో భాగంగా బడా పారిశ్రామిక వేత్తలు, నాయకులను కలుసుకోబోతున్నారు.

భారత ప్రధాని సమావేశం నేపథ్యంలో అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్, వందలవేల భారతీయుల తరఫున, అమెరికా ప్రజల తరఫున హోస్టన్ సిటీ మీకు సాదర స్వాగతం పలుకుతుంది అంటూ తమ ఆహ్వానాన్ని పంపారు. నరేంద్ర మోదీ సభతో భారత్- అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని, అమెరికాలో భారతీయులకు  మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement