Biggest Bank Fraud: ఏకంగా 28 బ్యాంకులను మోసం చేసి, రూ.22,842 కోట్లు కొల్లగొట్టిన ఏబీజీ షిప్‌యార్డ్‌ సంస్థ డైరక్టర్లు..

దేశంలోనే మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది.

File image used for representational purpose | (Photo Credits: ANI)

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 12 : దేశంలోనే మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది. దీంతో ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌పై కేసు నమోదు చేసింది. ఏబీజీ గ్రూప్‌ కంపెనీల్లో, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ కీలకమైంది. గుజరాత్‌లోని దహేజ్, సూరత్‌లో దీనికి షిప్‌యార్డ్‌లున్నాయి. షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్‌లో పేరున్న ఈ కంపెనీ సుమారు 165 నౌకలను నిర్మించింది. దీంతో కంపెనీ అవసరాల నిమిత్తం ఎస్‌బీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల నుంచి కోట్లలో భారీగా రుణాలు పొందింది. అయితే ఆ నిధులను కంపెనీ అవసరాలకు వినియోగించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. కంపెనీ, దాని డైరెక్టర్లు తమ సొంత లాభం కోసం బ్యాంకు నిధులను దారి మళ్లించారని, బ్యాంకులకు వాయిదాలు చెల్లించకుండా చేతులెత్తేశారని సీబీఐ తెలిపింది.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

కాగా, 2019 నవంబర్‌ 8న ఎస్‌బీఐ తొలిసారి సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపించింది. ఎస్‌బీఐకు రూ.2,925 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.7,089 కోట్లు, ఐడీబీఐకి రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.1,244 కోట్లు, ఐవోబీకి రూ.1,228 కోట్లు బకాయి పడినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో అతి పెద్ద బ్యాంకు మోసంపై సీబీఐ దృష్టిసారించింది. ఈ భారీ బ్యాంకు మోసంపై ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ చివరకు ఈ నెల 7న ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర వారు మోసగించినట్లు ఆరోపించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్‌లైన్‌లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Madhya Pradesh Horror: సమాజం సిగ్గుపడే ఘటన, ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు దారుణ అత్యాచారం, బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు వేసిన వైద్యులు, చావు బతుకుల మధ్య పోరాడుతూ..

Crypto Currency Fraud: హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ,వేలాది నుండి డబ్బులు వసూలు

Advertisement
Advertisement
Share Now
Advertisement