Indian Railways: విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06549) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 5న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06550) ఈ నెల 6న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది.

ప్రయాణికులకు అలర్ట్, 240 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే, రద్దయిన రైళ్ల పూర్తి సమాచారం ఇదిగో, జాబితాలో మీ రైలు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

- అలాగే, సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06521)రైలు ఈ నెల 3న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06522) ఈ నెల 4న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది.

- సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–కాచిగూడ(06523) ఈ నెల 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06524) ఈ నెల 4, 6 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరుకు చేరుకుంటుంది

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Advertisement
Advertisement
Share Now
Advertisement