Income Tax Slabs: బడ్జెట్ 2021తో టాక్స్ చెల్లించే ఉద్యోగులకు కొత్తగా ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఇన్‌కాం టాక్స్ శ్లాబులు ఎలా ఉన్నాయో మరోసారి పరిశీలించండి

కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, జీతాల్లో కోతలు విధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరంతా ఉన్నదాంట్లోనే పొదుపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఇన్ కాం టాక్స్ నుంచి కొన్ని రాయితీలు, మినహాయింపులు ఉంటాయని భావించారు. అయితే....

Income Tax Filing (Photo Credits: Pixabay)

New Delhi, February  2: సార్వత్రిక బడ్జెట్ వేతనజీవుల ఆశలకు గండికొట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో వ్యక్తిగత పన్నుల విషయంలో పెద్ద మార్పులను ప్రకటించలేదు. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, పిపిఎఫ్ పరిమితి, సెక్షన్ 80 సి మినహాయింపులో మార్పులు లేవు.

సీనియర్ సిటిజన్లకు మాత్రం కొంత ఉపశమనం కలిగించారు. 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు ఎవరైతే పెన్షన్ మరియు వడ్డీ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉంటారో వారికి ఐటీఆర్ ఫైల్ చేయటం నుంచి మినహాయింపునిచ్చారు.

సరసమైన గృహాలకు వడ్డీ చెల్లింపుపై రూ .1.5 లక్షల తగ్గింపును మరో ఏడాది వరకు పొడగించటం ద్వారా కొత్తగా చిన్న ఇల్లు కొనుక్కోవాలనే వారికి కొంత ఊరట లభించినట్లయింది.

కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, జీతాల్లో కోతలు విధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరంతా ఉన్నదాంట్లోనే పొదుపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఇన్ కాం టాక్స్ నుంచి కొన్ని రాయితీలు, మినహాయింపులు ఉంటాయని భావించారు. అయితే అలాంటిదేమి జరగకపోగా 2.5 లక్షల వార్షిక పీఎఫ్ చెల్లింపులకు వచ్చే వడ్డీపై అదనపు టాక్సు వసూలు చేయనున్నారు.

గత సంవత్సరం ఆదాయపు పన్ను పథకంలో ఈ క్రింది పన్ను స్లాబ్‌లు ఉన్నాయి..

సంవత్సరానికి రూ .5 లక్షల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను ఉండదు.

సంవత్సరానికి రూ .5 లక్షల నుండి 7.5 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .7.5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 15 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .10 లక్షల నుండి 12.5 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 20 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ 12.5 లక్షల నుంచి రూ .15 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 25 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .15 లక్షలకు పైబడిన ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 30 శాతం ఉంటుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు

Advertisement
Advertisement
Share Now
Advertisement