Chandini-Manikandan Case: ఆ మాజీ మంత్రి పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడు, నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నటి చాందిని, కోర్టులో వచ్చే నెల 5న విచారణకు రానున్న పిటిషన్‌

అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు (Former Minister Manikandan) నటి చాందిని షాక్‌ ఇచ్చారు. తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ (asking Rs 10 crore compensation) గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

M Manikandan (photo Credits: IANS)

Chennai, July 24: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు (Former Minister Manikandan) నటి చాందిని షాక్‌ ఇచ్చారు. తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ (asking Rs 10 crore compensation) గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని తనతో (Actress Chandini) సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు.

ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్‌

నోమాడ్స్ చిత్రంతో పాపులారిటీ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడింది. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ చాందిని తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement