Oxford COVID-19 Vaccine: ఆశలు ఆవిరి, ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ నిలిపివేయండి, సీరం ఇన్స్‌టిట్యూట్‌కు ఆదేశాలు జారీ చేసిన డీసీజీఐ, అస్వ‌స్థ‌త‌కు లోనైన టీకా తీసుకున్న వాలంటీర్

కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటిదాకా ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) వస్తుందని అందరికీ ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఈ ఆశలపై డీసీజీఐ నీళ్లు చల్లింది. భార‌త్‌లో నిర్వ‌హించాల్సిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను (Phase 2, 3 COVID-19 Vaccine Clinical Trials) నిలిపివేయాల‌ని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) (Drugs Controller General of India (DCGI) ఆదేశాలు జారీ చేసింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా కోవిడ్ వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న సంగతి విదితమే.

Vaccine | Image used for representational purpose (Photo Credits: Oxford Twitter)

New Delhi, September 12: కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటిదాకా ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) వస్తుందని అందరికీ ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఈ ఆశలపై డీసీజీఐ నీళ్లు చల్లింది. భార‌త్‌లో నిర్వ‌హించాల్సిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను (Phase 2, 3 COVID-19 Vaccine Clinical Trials) నిలిపివేయాల‌ని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) (Drugs Controller General of India (DCGI) ఆదేశాలు జారీ చేసింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా కోవిడ్ వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న సంగతి విదితమే.

అయితే ఇటీవ‌ల లండ‌న్‌లో ఆ టీకా తీసుకున్న ఓ వాలంటీర్ అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. దీంతో బ్రిట‌న్‌లో ఆ టీకా ట్ర‌య‌ల్స్‌ను ఆపేశారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌తో కలిసి భార‌త్‌లో పూణెకు చెందిన సీరం ఇన్స్‌టిట్యూట్ కూడా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ది. త‌క్ష‌ణ‌మే ఇండియాలో ట్ర‌య‌ల్స్ ఆపేయాల‌ని డీసీజీఐ కంట్రోల‌ర్‌ జ‌న‌ర‌ల్‌ సోమ‌ని ఆదేశాలు జారీ చేశారు. భార‌త్‌లో తొలి ద‌శ‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా ఇచ్చిన వారిని మానిట‌ర్ చేయాల‌ని, దానికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ను, నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డీసీజీఐ ఆదేశాలు ఇచ్చింది.

మే నెల నాటికే 64 లక్షల మందికి కరోనా, సెరో సర్వేలో విస్తుగొలిపే నిజాలు, దేశంలో 46,59,984కు చేరుకున్న కోవిడ్ కేసుల సంఖ్య, తాజాగా 97,570 మందికి కరోనా

బ్రిట‌న్‌కు చెందిన డేటా అండ్ సేఫ్టీ మానిట‌రింగ్ బోర్డు ఇచ్చిన క్లియ‌రెన్స్ స‌ర్టిఫికెట్‌ను కూడా త‌మ‌కు స‌మ‌ర్పించాలంటూ సోమాని త‌న లేఖ‌లో సీరం సంస్థ‌ను కోరారు. ఆస్ట్రాజెన్‌కా సంస్థ ఇత‌ర దేశాల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేసిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని కూడా సీరం సంస్థ‌కు డీసీజీఐ నోటీసులు ఇచ్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Champions Trophy 2025: సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమ మ్యాచ్‌ల్లో ఓడితే భారత్, అఫ్గాన్‌ల మధ్య తొలి సెమీ ఫైనల్, పూర్తి వివరాలు ఇవిగో..

Latest ICC ODI Rankings: ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే గిల్‌, అయిదవ స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Share Now